ETV Bharat / city

AYYANNA: బొత్సలా లోకేశ్​కు మాట్లాడటం రాదు: అయ్యన్నపాత్రుడు

author img

By

Published : Apr 29, 2022, 2:12 PM IST

ayyanna comments on botsa
బొత్స మాట్లాడినట్లు.. లోకేశ్​కి మాట్లాడటం రాదు

AYYANNA: వైఎస్ విజయలక్ష్మి, జగన్ తీరు దొంగే..దొంగ దొంగ అని అరిచినట్టు ఉందంటూ గతంలో బొత్స ఎంతో మర్యాదగా మాట్లాడినట్లు లోకేశ్​​కి మాట్లాడటం రాదని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్, విజయ్మలపై గతంలో బొత్స చేసిన వ్యాఖ్యాలను అయ్యన్న తన ట్విట్టర్​కు జత చేశారు.

AYYANNA: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి వెనుక జగన్‌ హస్తముందని గతంలో బొత్స మాట్లాడినట్లు లోకేశ్‌కి మాట్లాడటం రాదని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వైఎస్‌ విజయలక్ష్మి, జగన్‌ తీరు..దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టు ఉందంటూ ట్వీట్‌ చేశారు. బొత్సలా ఎంతో మర్యాదగా మాట్లాడటం లోకేశ్‌కి మాట్లాడటం చేతకాదన్నారు. మహిళలకు అండగా నిలుస్తున్న లోకేశ్‌ని చూసి.. అక్కసుతో జగన్‌ మనుషులు రాళ్ళు విసిరితే దానిని మంత్రి కవర్‌ చేయడం సరికాదని ట్వీట్‌లో పేర్కొన్నారు. జగన్, విజయమ్మలపై గతంలో బొత్స చేసిన వ్యాఖ్యలను అయ్యన్న తన ట్విట్టర్ ఖాతాకు జతచేశారు.

  • కడుపుమంట అనుకోవడంలో తప్పులేదు. మహిళలకు అండగా నిలుస్తున్న లోకేష్ ని చూసి అక్కసు తో గ్యాస్ ఎక్కువై జగన్ రెడ్డి పంపిన రౌడీలు రాళ్ళు విసిరితే కడుపుమండి ఎవరో చేసారని కవరింగ్ ఎందుకు బొత్సా?.2/2@BotchaBSN

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Murder: తండ్రిని చంపిన కుమార్తె.. ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.