ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 3,967 కరోనా కేసులు, 25 మరణాలు

author img

By

Published : Oct 16, 2020, 7:25 PM IST

Updated : Oct 16, 2020, 8:11 PM IST

రాష్ట్రంలో కొత్తగా 3,967 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 3,967 కరోనా కేసులు

18:08 October 16

తాజా కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.  ఇవాళ తాజాగా 3,967 మందికి కోవిడ్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 7,75,470కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 25 మంది మృతి చెందారు. కాగా ఇప్పటి వరకు వైరస్ కారణంగా 6,382 మంది ప్రాణాలు విడిచారు. మరో 5,010 మంది బాధితులు కోలుకోగా...ప్రస్తుతం 38,979 యాక్టివ్‌ కేసులున్నాయి.  

జిల్లాల వారీగా కేసులు  

పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 627 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 608, చిత్తూరు 510, కృష్ణా456, ప్రకాశం 355, గుంటూరు 246, అనంతపురం 233, నెల్లూరు 220, కడప 212, విశాఖ 206, శ్రీకాకుళం 108, కర్నూలు 100, విజయనగరం 86 కేసుల చొప్పున నమోదయ్యాయి.  

జిల్లాల వారీగా మరణాలు  

కరోనాతో చిత్తూరులో అత్యధికంగా అయిదుగురు మృతి చెందారు. కడప 4 , కృష్ణా 4, గుంటూరు 3, ప్రకాశం 3, తూర్పుగోదావరి 2, నెల్లూరులో 1,  శ్రీకాకుళం1 , విశాఖ1 , పశ్చిమగోదావరి 1 చొప్పన ప్రాణాలు కోల్పోయారు.

ఇదీచదవండి

'తెదేపా తెచ్చిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం ప్రారంభిస్తోంది..'

Last Updated :Oct 16, 2020, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.