Bear attack: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. దోర్నాల - శ్రీశైలం అటవీ ప్రాంతం పరిధిలోని ఇష్టకామేశ్వరీ ఆలయం సమీపంలో ఘటన జరిగింది. యర్రగొండపాలెం గాంధీ నగర్ కు చెందిన బయ్యన్న అనే యువకుడు పండ్ల సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. ఇష్టకామేశ్వరీ ఆలయానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉండగా బయ్యన్నపై భళ్లూకం ఒక్కసారిగా దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన యువకున్ని సున్నిపెంట ఆస్పత్రికి తీసుకెళ్లగా, మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అటవీ ప్రాంతంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 9:28 PM IST
Bear attack: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. దోర్నాల - శ్రీశైలం అటవీ ప్రాంతం పరిధిలోని ఇష్టకామేశ్వరీ ఆలయం సమీపంలో ఘటన జరిగింది. యర్రగొండపాలెం గాంధీ నగర్ కు చెందిన బయ్యన్న అనే యువకుడు పండ్ల సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. ఇష్టకామేశ్వరీ ఆలయానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉండగా బయ్యన్నపై భళ్లూకం ఒక్కసారిగా దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన యువకున్ని సున్నిపెంట ఆస్పత్రికి తీసుకెళ్లగా, మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.