ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్టు చేయాలి : టీడీపీ - GV Anjaneyulu comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 10:15 PM IST

thumbnail
ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్టు చేయాలి : టీడీపీ (ETV Bharat)

TDP Leader GV Anjaneyulu and Lokesh Comments on Pinnelli EVM Destroy Case : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా అరెస్టు చేయకపోవడంపై పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించిందని, కారంపూడి సీఐని కొట్టి గాయపరిచిన కేసులో ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసునే చంపబోయిన వ్యక్తిని ఎందుకు రక్షిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రమంతా ముక్కున వేలేసుకుంటున్నా పోలీసుల్లో మాత్రం కనీస చలనం లేదని ఎద్దేవా చేశారు. 

ఇప్పటికైన పోలీసులు వైఎస్సార్సీపీ స్వామి భక్తిని పక్కనబెట్టకపోతే కౌంటింగ్‌ రోజు ప్రజలకు రక్షణగా ఎవరు ఉంటారని ప్రశ్నించారు. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వెంటనే పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి 20 ఏళ్లుగా మారణహోమం సాగిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశానికి మద్దతిస్తున్నారనే కారణంతో గ్రామాలకు గ్రామాల్నే తగలబెడుతున్నారని 'ఎక్స్' వేదికగా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.