ETV Bharat / city

PERNI NANI: 'ప్రకాశం బ్యారేజ్​కు భారీగా వరద.. నదిలోకి ఎవరూ వెళ్లొద్దు'

author img

By

Published : Aug 1, 2021, 5:24 PM IST

మంత్రి పేర్నినాని
మంత్రి పేర్నినాని

ప్రకాశం బ్యారెజ్​కు భారీగా వరద చేరుతోందని మంత్రి పేర్నినాని తెలిపారు. కృష్ణానదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

ప్రకాశం బ్యారేజ్​కు భారీగా వరదనీరు వస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. శ్రీశైలం, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారెజ్​కు భారీగా వరద నీరు వస్తుందని వెల్లడించిన మంత్రి.. సాయంత్రానికి లక్ష క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్​కు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.

రేపటికి.. 5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని మంత్రి అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కృష్ణా నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్ని నాని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన ఎవరూ నదీలో దిగవద్దని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

PROTEST: అలుపెరగని అమరావతి అన్నదాతలు.. 593వ రోజూ ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.