ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM

author img

By

Published : Oct 7, 2021, 2:59 PM IST

.

ప్రధాన వార్తలు @ 3PM
ప్రధాన వార్తలు @ 3PM

  • విశాఖకు మోడల్ ఫిషింగ్ హార్బర్ : కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి
    తీర ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్ తెలిపారు. మత్స్యకారుల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నెల్లూరులో జరిగిన మత్స్యకార సంక్షేమ సమితి సమావేశంలో పాల్గొన్న ఆయన.. దేశంలో అయిదు మోడల్ ఫిషింగ్ హార్బర్​లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, వాటిలో ఒకటి విశాఖలో ఏర్పాటు కానుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రాష్ట్రంలో 9,160 స్కూళ్లలో.. ఒక్కొక్కరే మాస్టార్లు!
    ‘నో టీచర్‌ నో క్లాస్‌... స్టేట్‌ ఆఫ్‌ ది ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ ఫర్‌ ఇండియా-2021’ పేరుతో యునెస్కో ఓ నివేదిక విడుదల చేసింది. అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రానికి ఇంకా 27,398 మంది ఉపాధ్యాయుల అవసరం ఉందని నివేదికలో వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ప్రొద్దుటూరులో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం
    కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వరకూ జరిగే దసరా ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • శ్రీవారికి రోజూ ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా..!
    శ్రీవారి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. శ్రీవారి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలను తితిదే తయారు చేస్తోంది. శ్రీనివాసుని లడ్డూకి తితిదే పేటెంట్‌ హక్కులను సైతం సాధించుకుంది. ఈ లడ్డూల ప్రత్యేకత ఏంటి?, రోజూ శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారు? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు
    ఆదాయ పన్ను శాఖ దేశంలోని అనేక ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులు, ఆ రాష్ట్రంలోని మరికొందరు రియల్ ఎస్టేట్ డెవలపర్ల నివాసాలు, కార్యాలయాలపై గురువారం దాడులు జరిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఆరు నెలలు తర్వాత తెరుచుకున్న షిరిడీ సాయినాథుడి మందిరం
    కరోనా కారణంగా ఆరు నెలలుగా మూసి ఉన్న షిరిడీ సాయి‌నాథుడి మందిరాన్ని తిరిగి తెరిచారు. దీంతో బాబా దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అడ్వాణీ, జోషికి భాజపాలో మరోమారు కీలక బాధ్యతలు!
    భాజపా సీనియర్​ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి సహా మొత్తం 80 మందితో జాతీయ కార్యనిర్వాహక బృందాన్ని(bjp national executive body) ఏర్పాటు చేసింది కమలదళం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మలేరియాకు ఎట్టకేలకు టీకా.. తొలి డోసు వారికే...
    మలేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల్లో మూడింట రెండు వంతుల మంది ఆఫ్రికాలోని ఐదేళ్లలోపు చిన్నారులే. ఈ నేపథ్యంలో మలేరియా మరణాలను తగ్గించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి ముప్పు అధికంగా ఉన్న చిన్నారులకు మలేరియా టీకాను(Malaria Vaccine News) విస్తృతంగా వినియోగించేందుకు ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఆర్సీబీకి శాపంగా హైదరాబాద్.. ప్రతిసారి అడ్డంకే!
    ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా బుధవారం సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs SRH 2021). అయితే ఇప్పటివరకు ఐపీఎల్​ చరిత్రలో ఆర్సీబీ ప్రతిసారి హైదరాబాద్​ చేతిలో కంగుతిని ప్లేఆఫ్స్ ఆశల్ని కోల్పోవడమో, టాప్​-2 నుంచి వైదొలగడమో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • క్యాబ్ డ్రైవర్​తో గొడవ.. నటి సంజన క్లారిటీ
    క్యాబ్​ డ్రైవరు(sanjjanaa galrani latest news) అపహరించాడని ఆరోపణలు చేసిన నటి సంజనా గల్రానిపై బాధిత డ్రైవరు సుసైయ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సంజనా​ చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పాడు. ఈ కంప్లెయింట్​ను పరిగణలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.