కర్నూలులో హెబ్బా పటేల్ సందడి - చూసేందుకు పోటీ పడ్డ అభిమానులు - heroine hebah patel in kurnool

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 10:44 PM IST

thumbnail
కర్నూలులో సందడి చేసిన హెబ్బా పటేల్ - చూసేందుకు పోటీ పడ్డ అభిమానులు (ETV Bharat)

Heroine Hebah Patel in Kurnool: కర్నూలులో హీరోయిన్ హెబ్బా పటేల్ గురువారం సందడి చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కుమారి 21ఎఫ్ ఫేమ్ హీరోయిన్ హెబ్బా పటేల్ సందడి చేశారు. పట్టణంలోని ఆలూరు రోడ్డులో వీ.ఎస్.బీ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ ఎగ్జిబిషన్ సేల్​కు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. పలు వస్త్రాలతో మీడియాకు ఫోజులిచ్చిందీ ముద్దుగుమ్మ. గతంలో ఒకసారి కర్నూలుకు వచ్చానని ఆమె గుర్తు చేసుకున్నారు. రెండు నెలల పాటు వస్త్ర ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కర్నూలు విచ్చేసిన హెబ్బా పటేల్​ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. 

కొద్ది రోజుల క్రితం కూడా హెబ్బాపటేల్ కర్నూలుకు విచ్చేసింది. అప్పుడు యాంకర్ అనసూయ భరద్వాజ్​తో కలిసి హీరోయిన్ హెబ్బా పటేల్ వచ్చారు. అప్పుడు కూడా నగరంలోని ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో తనకు ఉగ్గాని, బజ్జీలు అంటే ఎంతో ఇష్టమని యాంకర్ అనసూయ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.