ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : May 27, 2022, 8:57 PM IST

ap top news
ప్రధాన వార్తలు @9PM

.

  • మహా ప్రభంజనంలా తెలుగుదేశం మహానాడు
    అప్పుడు ఎన్టీఆర్ వ్యవసాయ మోటర్లకు మీటర్లను తీసేస్తే.. ఇప్పుడు వైకాపా మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకువచ్చిందని చంద్రబాబు విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోటర్లకు మీటర్లు పెట్టనివ్వమని తేల్చి చెప్పారు. మహా ప్రభంజనంలా తెలుగుదేశం మహానాడు తొలురోజు వేడుక మహోత్సవంలా ఘనంగా ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'క్విట్ జగన్-సేవ్ ఏపీ'.. మహానాడులో రాజకీయ తీర్మానం
    ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా మహానాడులో 'క్విట్ జగన్-సేవ్ ఏపీ' పేరుతో రాజకీయ తీర్మానాన్ని పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొని విజయం సాధించాలని.. వందేళ్లకు సరిపడా నాయకత్వాన్ని అందించేలా ప్రణాళికతో వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమలాపురంలో అక్కడ ఆంక్షలు సడలింపు..
    కఠిన ఆంక్షల నడుమ చిక్కుకున్న అమలాపురంలో ప్రజలకు నేడు కాస్త ఉపశమనం కలిగింది. మూడు రోజుల తరువాత నేడు పోలీసు బందోబస్తును కాస్త సడలించటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాబోయే రెండురోజుల్లో.. రాష్ట్రంలో వర్షాలు!
    రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాలు వేగంగా భారత్​ వైపు కదులుతున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'టెక్నాలజీకి గత పాలకులు దూరం- పేదలకు నష్టం'
    2014కు ముందు పరిపాలనలో సాంకేతికతను ఉపయోగించకపోవడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోయారని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. డ్రోన్ల సాంకేతికతతో కొత్త శకం మొదలైందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లోయలో పడ్డ వాహనం.. ఏడుగురు సైనికులు దుర్మరణం
    లద్దాఖ్​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది సైనికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి శ్యోక్​ నది సమీపంలో లోయలో పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లీటర్ పెట్రోల్ ధర రూ.30 పెంపు- మోదీపై మాజీ ప్రధాని ప్రశంసలు
    ఆర్థికంగా సతమవుతున్న పాకిస్థాన్​లో ఇంధన ధరలను పెంచి ప్రజలపై మరింత భారం వేసింది అక్కడి ప్రభుత్వం. అన్ని రకాల పెట్రోల్​ ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ చర్యపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్​ తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వారాంతంలో 'బుల్'​ జోరు.. సెన్సెక్స్​ 630, నిఫ్టీ 180 ప్లస్​
    స్టాక్​ మార్కెట్లలో వరుసగా రెండో సెషన్​లోనూ లాభాల జోరు కొనసాగింది. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలతో సెన్సెక్స్ 630, నిఫ్టీ 180 పాయింట్లకుపైగా లాభపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మెల్ట్‌వాటర్‌' చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో ప్రజ్ఞానందకు నిరాశ
    మెల్ట్‌వాటర్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద పోరాడి ఓడిపోయాడు. చైనా ఆటగాడు డింగ్‌ లీరెన్‌ దూకుడుతో ఓటమి తప్పలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • F3 సక్సెస్​ సెలబ్రేషన్స్​.. 'విక్రమ్'​ సాంగ్​ రిలీజ్​.. 'బ్రహ్మాస్త్ర' ప్రోమో
    సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో కమల్ హాసన్​ 'విక్రమ్'​, రణ్​బీర్​-అలియా 'బ్రహ్మాస్త్ర', విశ్వక్​ సేన్​ 'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. మరోవైపు, కేక్ కట్ చేసి 'ఎఫ్ 3' విజయోత్సవం జరుపుకున్నారు దిల్​రాజు, వెంకటేశ్​, వరుణ్​తేజ్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.