ETV Bharat / sports

'మెల్ట్‌వాటర్‌' చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో ప్రజ్ఞానందకు నిరాశ

author img

By

Published : May 27, 2022, 9:56 AM IST

మెల్ట్‌వాటర్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత యువ కెరటం ప్రజ్ఞానంద పోరాడి ఓడిపోయాడు. చైనా ఆటగాడు డింగ్‌ లీరెన్‌ దూకుడుతో ఓటమి తప్పలేదు.

Praggnanandhaa
ప్రజ్ఞానంద

మెల్ట్‌వాటర్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత యువ కెరటం ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. రెండు రోజలు పాటు ప్రపంచ రెండో ర్యాంకర్‌ డింగ్‌ లీరెన్‌ (చైనా)తో జరిగిన పోరులో ఓడిపోయాడు.

ఆఖరి సమరంలో భాగంగా తొలిరోజు ప్రజ్ఞానంద 1.5-2.5తో నిలిచాడు. మొదటి తొలి గేమ్‌ను కోల్పోయినా రెండో గేమ్‌లో గెలిచి స్కోరు సమం చేశాడు. అయితే మూడో గేమ్​ను మళ్లీ ప్రజ్ఞానంద కోల్పోవల్సి వచ్చింది. నాలుగో గేమ్‌ను 39 ఎత్తుల్లో డ్రా చేసుకుని ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. చివరి రోజు జరిగిన గేమ్​లలో లీరెన్‌ ముందంజలో ఉండటం వల్ల అతిడినే విజేతగా ప్రకటించారు న్యాయ నిర్ణేతలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.