ETV Bharat / state

అక్కడ ఆంక్షలు సడలింపు.. ఊపిరి పీల్చుకున్న ప్రజానీకం

author img

By

Published : May 27, 2022, 8:38 PM IST

కఠిన ఆంక్షల నడుమ చిక్కుకున్న అమలాపురంలో ప్రజలకు నేడు కాస్త ఉపశమనం కలిగింది. మూడు రోజుల తరువాత నేడు పోలీసు బందోబస్తును కాస్త సడలించటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఆంక్షలు సడలింపు
ఆంక్షలు సడలింపు

కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న విధ్వంసకర ఈ సంఘటన నేపథ్యంలో.. ఏర్పాటు చేసిన పటిష్ఠ పోలీసు బందోబస్తు ఈరోజు కాస్త సడలించారు. పౌరుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆంక్షలు సడలించారు. దాంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Tension at Amalapuram: కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసనకారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇదీ చదవండి: అట్టుడికిన అమలాపురం.. 'కోనసీమ' జిల్లా పేరు మార్పుపై హై టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.