ETV Bharat / city

సుప్రీంలో ఒడిశా పిటిషన్​పై ఏపీ అఫిడవిట్.. విచారణ 4 వారాలకు వాయిదా

author img

By

Published : Feb 19, 2021, 1:22 PM IST

తమ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని.. ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ.. 4 వారాలకు వాయిదా వేసింది.

supreme court
సుప్రీం కోర్టు

ఏపీ ప్రభుత్వంపై.. సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై​ విచారణ జరిగింది. తమ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ.. ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఎం ఖాన్ విల్కర్ ధర్మాసనం విచారణ జరిపింది.

ఒడిశా పిటిషన్​పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయనగరం కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోటియా పరిధిలో ఉన్న 3 గ్రామాలు.. ఏపీకి చెందినవేనని ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. మూడు గ్రామాల్లో గతంలోనూ ఎన్నికలు నిర్వహించినట్లు వివరించారు.

ఆ మూడు గ్రామాలు... అరకు ఎంపీ, సాలూరు అసెంబ్లీ స్థానాల పరిధిలోనివనీ.. ఒడిశా పిటిషన్​ కొట్టివేయాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. ఏపీ అఫిడవిట్​పై సమాధానానికి ఒడిశా ప్రభుత్వం 4 వారాల గడవు కోరింది. ఇరువరి వాదనలు విన్న ధర్మాసనం తదపురి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

మా భూభాగంలో ఏపీ పంచాయతీ ఎన్నికలా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.