ETV Bharat / city

బాబూ జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్

author img

By

Published : Apr 5, 2021, 9:28 AM IST

chandrababu and lokesh
చంద్రబాబు, లోకేశ్

బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు.

  • గాంధీజీ చేత అమూల్య రత్నగా పిలువబడ్డ బాబు జగ్జీవన్ రామ్ సామాజిక వివక్ష, అసమానతలు లేని ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం కృషిచేశారు. ఆ ఆదర్శమూర్తి స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం పోరాడుదాం. pic.twitter.com/8dllMD4qos

    — N Chandrababu Naidu (@ncbn) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాబూ జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా.. ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ప్రజాస్వామ్య సమాజ నిర్మాణానికి జీవితాంతం కృషిచేసిన వ్యక్తి బాబు జగ్జీవన్‌రామ్‌ అని అన్నారు. బడుగువర్గాల అభ్యున్నతి కోసం పోరాడడని చంద్రబాబు అన్నారు.

  • భారతదేశ స్వరాజ్య ఉద్యమంలోనూ... స్వాతంత్య్రం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారు డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌. జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన బాబూజీ జయంతి సందర్భంగా ఆ మానవతావాది స్మృతికి నివాళులు pic.twitter.com/2sR9SOzNDM

    — Lokesh Nara (@naralokesh) April 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ ద్వారా నివాళుర్పించారు. జీవితమంతా సమసమాజ స్థాపన కోసం.. బాబూ జగ్జీవన్‌రామ్‌ కృషిచేశారని లోకేశ్‌ అన్నారు.

ఇదీ చదవండి: 8న పరిషత్​కు పోలింగ్‌.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.