ETV Bharat / bharat

కారులో నవ దంపతులు సజీవ దహనం.. కారణమేంటి?

author img

By

Published : May 22, 2022, 5:41 PM IST

Updated : May 22, 2022, 9:00 PM IST

Couple charred to death: కారులో మంటలు చెలరేగి నవ దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని ఉడుపిలో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. దంపతులు బెంగళూరులోని ఆర్​టీ నగర్​కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నట్లు చెప్పారు.

Couple charred to death
నవ దంపతుల సజీవ దహనం

కారులో నవ దంపతులు సజీవ దహనం

Couple charred to death: కారులో మంటలు చెలరేగి నవ దంపతులు సజీవ దహనమైన విషాద ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మంటల్లో కాలిపోతున్న కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. మృతులు బెంగళూరులోని ఆర్​టీ నగర్​కు చెందిన దంపతులు యశ్వంత్​(23), జ్యోతి(23)లుగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరు ఆర్​టీ నగర్​కు చెందిన దంపతులు మే 18న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు జ్యోతి తన కుటుంబ సభ్యులతో తెలిపింది. మరోవైపు.. తరగతులకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు యశ్వంత్​ చెప్పారు. ఇంటికి తిరిగి రాలేదు. దీంతో హెబ్బల్​ పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు.

Couple charred to death
నవ దంపతుల సజీవ దహనం

ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఉడుపిలో మంటల్లో కాలిపోతున్న కారును గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తాము వెళ్లేసరికే ఇద్దరు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. తమ జీవితాలను ముగిస్తున్నామని వారి తల్లిదండ్రులకు సందేశం పంపించారని తెలిపారు. అయితే, వారి మరణానికి గల అసలు కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఇంట్లోకి వెళ్లి ఏనుగు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం

కుక్కల నుంచి తప్పించుకోబోయి బోరుబావిలో బాలుడు- మృత్యువుతో పోరాటం

Last Updated : May 22, 2022, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.