ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. యాక్సిడెంట్​ చూసి డ్రైవర్​కు గుండెపోటు​..

author img

By

Published : Dec 31, 2022, 8:15 AM IST

Updated : Dec 31, 2022, 11:58 AM IST

road accident in gujarat
రోడ్డు ప్రమాదం

08:12 December 31

డ్రైవర్​కు గుండెపోటు.. రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి..

road accident in gujarat
బస్సును ఢీకొన్న కారు

గుజరాత్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ముంబయి-అహ్మదాబాద్​ హైవేపై శనివారం వేకువజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం సమయంలో కారులో ఉన్న 9 మందిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ప్రమాదం చూసిన బస్సు డ్రైవర్​కు ఒక్కసారిగా గుండెపోటు రావడం వల్ల అతడు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పూర్తి విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ వీఎన్​ పటేల్​ తెలిపారు.

మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సంతాపం తెలిపారు. అనంతరం మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. దీనితో పాటు గాయపడిన ఒక్కొక్కరికీ రూ.50,000 పరిహారం అందిస్తున్నట్లు ట్వీట్​ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిచాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

వల్సాద్​ నుంచి అతివేగంగా ప్రయాణిస్తున్న ఎస్​వీయూ డివైడర్​ను ఢీకొని.. ఎదురుగా ఉన్న మరో ట్రాక్​పై పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు దాన్ని ఢీకొంది. దీంతో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్నవారంతా.. అంక్లేశ్వర్​ వాసులుగా పోలీసులు గుర్తించారు. వారంతా వల్సాద్​ నుంచి తమ స్వగ్రామానికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఉన్న వారంతా వల్సాద్​ వాసులుగా పోలీసులు గుర్తించారు.

Last Updated :Dec 31, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.