30 మంది సీఎంలలో 29మంది కోటీశ్వరులు.. జగన్ టాప్.. లాస్ట్ ఎవరంటే..

author img

By

Published : Apr 12, 2023, 2:32 PM IST

Updated : Apr 12, 2023, 3:16 PM IST

AP CM Richest In India

దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడు.. ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్ ​మోహన్​ రెడ్డి. మరి అత్యంత తక్కువ ఆస్తి ఉన్న ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?

భారత దేశంలో ప్రస్తుతం ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే. వీరిలో ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​​ జగన్​ మోహన్​ రెడ్డి.. రూ.510కోట్లు విలువైన ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆస్తుల విషయంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిట్టచివరన ఉన్నారు. ఆమె పేరిట కేవలం 15 లక్షల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి.

అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​- ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్​(ఎన్​ఈడబ్ల్యూ) అనే సంస్థలు ఈమేరకు ఓ నివేదిక విడుదల చేశాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్​లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఆయా సంస్థలు తెలిపాయి.

ఏడీఆర్​- ఎలక్షన్ వాచ్​ నివేదికలోని కీలకాంశాలు..

  • భారత్​లోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (దిల్లీ, పుదుచ్చేరి) సీఎంల ఆస్తుల విశ్లేషణ. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్​కు ప్రస్తుతం ముఖ్యమంత్రి లేరు.
  • 30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం.. అంటే 29 మంది కోటీశ్వరులు. ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.33.96కోట్లు.
  • ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి (రూ.510కోట్లు); అరుణాచల్ ప్రదేశ్​ ముఖ్యమంత్రి పెమా ఖండూ (రూ.163 కోట్లు); ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్ (రూ.63 కోట్లు).. అత్యంత ఎక్కువ ఆస్తి కలిగిన ముగ్గురు ముఖ్యమంత్రులు.
  • బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (రూ.15 లక్షలు); కేరళ సీఎం పినరయి విజయన్​ (రూ.కోటి పైన); హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్ ఖట్టర్​ (రూ.కోటి పైన).. అతి తక్కువ ఆస్తి కలిగిన ముగ్గురు సీఎంలు.
  • 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆస్తి విలువ రూ.23.55కోట్లు.
  • బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తి ఒక్కొక్కరిగా రూ.3 కోట్లకు పైగా ఉంది.
  • 2018 శాసన సభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. ఆస్తి రూ.కోటికుపైగా ఉంది.
  • దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు సీఎం)​, బసవరాజ్​ బొమ్మై (కర్ణాటక సీఎం).. ఒక్కొక్కరికి రూ.8 కోట్లకుపైగా ఆస్తి ఉంది.
  • 30 మంది సీఎంలలో 43 శాతం.. అంటే 13 మంది తమపై తీవ్రమైన నేరాల(హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, బెదిరింపులు)కు సంబంధించిన కేసులు ఉన్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇవన్నీ బెయిల్​కు వీలు లేని ఐదేళ్లకన్నా ఎక్కువ శిక్ష పడే కేసులే.
Last Updated :Apr 12, 2023, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.