ETV Bharat / bharat

చిరకాల మిత్రుడితో యాసిడ్ దాడి​ బాధితురాలి పెళ్లి

author img

By

Published : Mar 3, 2021, 3:27 PM IST

ఒడిశాకు చెందిన యాసిడ్ దాడి​ బాధితురాలు ప్రమోదిని రౌల్.. తన చిరకాల స్నేహితుడిని వివాహమాడారు. తన జీవితంలో ఇది మరచిపోలేని ఘట్టమని తెలిపారు రౌల్​. 2009లో ప్రమోదిని రౌల్​పై ఓ ఆర్మీ అధికారి యాసిడి దాడి చేశాడు.

Odisha acid-attack survivor Pramodini Roul marries long-time friend
చిరకాల స్నేహితుడితో యాసిడ్ దాడి​ బాధితురాలి వివాహం

ఒడిశా భువనేశ్వర్​కు చెందిన యాసిడ్ దాడి బాధితురాలు ప్రమోదిని రౌల్​ వివాహం చేసుకుని ఎంతోమంది యాసిడ్ బాధితులకు ఆదర్శంగా నిలిచారు. తన చిరకాల స్నేహితుడు సరోజ్​ సాహూను సోమవారం సాయంత్రం వివాహమాడారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని సంతోషం వ్యక్తం చేశారు రౌల్​. ఈ సందర్భంగా 2009లో తనపై జరిగిన యాసిడ్​ దాడి.. చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Odisha acid-attack survivor Pramodini Roul marries long-time friend
చిరకాల స్నేహితుడితో యాసిడ్ దాడి​ బాధితురాలి వివాహం

'యాసిడ్ దాడి​ బాధితులు కుంగిపోవద్దు, కలలు కనండి.. వాటికోసం పోరాడండి. మీరేమీ తక్కువకాదు' అని సందేశమిచ్చారు రౌల్. కష్ట కాలంలో తనకు అండగా ఉన్న ఒడిశా రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

సరోజ్​ సాహూ, ప్రమోదిని రౌల్ 2014లో ఆసుపత్రిలో కలిశారు. 2018లో వారి నిశ్చితార్థం జరిగింది. సోమవారం సాయంత్రం ఒడిశా జగత్​సింగ్​పుర్ జిల్లా కనక్​పుర్​లో వారి వివాహం జరిగింది. ఈ వేడుకకు అనేక మంది యాసిడ్ దాడి​ బాధితులు హాజరయ్యారు.

2009, మే 4 న ఓ ఆర్మీ అధికారి.. ప్రమోదిని రౌల్​పై యాసిడ్​ దాడి చేశాడు. ఈ ఘటనతో దాదాపు 5ఏళ్లు ఇంటికే పరిమితమయ్యారు రౌల్.

ఇదీ చదవండి : వితంతు పెళ్లిపై కులపెద్దల ఆగ్రహం.. గ్రామ బహిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.