ETV Bharat / bharat

నర్సు నిర్వాకం- ఫోన్​ మాట్లాడుతూ రెండు సార్లు టీకా

author img

By

Published : Apr 3, 2021, 1:46 PM IST

Updated : Apr 3, 2021, 2:23 PM IST

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ నర్సు.. కరోనా వ్యాక్సిన్​ పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫోన్​లో మాట్లాడుతూ మర్చిపోయి మహిళకు ఓకేసారి రెండు డోసులు ఇచ్చింది . ఈ చర్యను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి దర్యాప్తునకు ఆదేశించారు.

Kanpur: Busy on phone, nurse administers vaccine shots twice
ఫోన్​లో​ మాట్లాడుతూ.. ఒకేసారి 2 కరోనా డోసులు

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​ మండోలీ ప్రాథమిక వైద్య కేంద్రంలో ఓ నర్సు.. ఫోన్​లో మాట్లాడుతూ మహిళకు రెండు కరోనా టీకా డోసులు ఒకేసారి ఇచ్చింది. ఈ ఘటనపై సీనియర్ వైద్యాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

ఏం జరిగింది?

ఏప్రిల్​ 2 న, ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​కు చెందిన కమలేశ్​ దేవి.. కరోనా టీకా తీసుకునేందుకు మండోలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. తనకు మొదటి డోసు ఇచ్చాక .. నర్సు ఫోన్​లో మాట్లాడుతూ రెండో డోసునూ ఇచ్చారని ఆమె తెలిపారు. అలా ఎందుకు చేశావంటే.. తనతో వాగ్వాదానికి దిగారని వివరించారు.

ఇదీ చదవండి : ఆ గ్రామంలో ఫ్రీ ఇంటర్నెట్​

Last Updated :Apr 3, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.