ETV Bharat / bharat

Afghan India news: అఫ్గాన్​ కోసం భారత్​ 'ఆపరేషన్ దేవీ శక్తి'

author img

By

Published : Aug 24, 2021, 2:46 PM IST

Updated : Aug 24, 2021, 3:34 PM IST

అఫ్గాన్​లో చిక్కుకున్న భారతీయులను(Indians in Afghanistan) స్వదేశానికి తరలించే మిషన్​కు 'ఆపరేషన్ దేవీ శక్తి అని' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

India's evacuation mission from Afghanistan named "Operation Devi Shakti"
ఆ మిషన్​ పేరు 'ఆపరేషన్ దేవీ శక్తి'

అఫ్గాన్​లో చిక్కుకున్న భారతీయులు(Indians in Afghanistan) సహా అక్కడి సిక్కులు, హిందువులను దిల్లీకి తరలించే ప్రక్రియకు 'ఆపరేషన్​ దేవీ శక్తి' అని పేరు పెట్టారు. మంగళవారం మరో 78 మంది అఫ్గాన్ నుంచి భారత్​ చేరుకున్న సందర్భంగా ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

'ఆపరేషన్ దేవీ శక్తి కొనసాగుతుంది. కాబుల్​లో(Kabul Airport) చిక్కుకున్న 78 మందిని వయా దుశాంబే భారత్​కు తీసుకొచ్చాం. ఈ ప్రక్రియలో నిరంతరాయంగా శ్రమిస్తున్న భారత వాయుసేన, ఎయిర్ ఇండియా, విదేశాంగ శాఖ బృందానికి సెల్యూట్​' అని జైశంకర్ ట్వీట్ చేశారు.

భారత్​ ఇప్పటివరకు 800కిపైగా మందిని అఫ్గాన్ నుంచి తీసుకొచ్చింది. వీరిలో భారతీయులతో పాటు అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారు.

అఫ్గాన్​ను తాలిబన్లు(Afghan Taliban) తమ అధీనంలోకి తెచ్చుకున్న మరునాడు ఆగస్టు 16 నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. మొదట 40 మందిని ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి తీసుకొచ్చింది.

ఇదీ చూడండి: Afghan News: అఫ్గాన్​ నుంచి భారత్​ చేరుకున్న మరో 78 మంది

Last Updated : Aug 24, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.