14వ విడత చర్చలకు భారత్​- చైనా సన్నద్ధం

author img

By

Published : Dec 2, 2021, 4:26 PM IST

Corps Commander talks

India China Military talks: సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్​-చైనా 14వ దఫా చర్చలకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్​ ద్వితీయార్థంలో ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

india China Military talks: వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించే దిశగా మరో దఫా చర్చలకు సిద్ధమవుతున్నాయి భారత్​, చైనా. ఇరు దేశాల మధ్య 14వ దఫా కార్ప్స్​ కమాండ్​ స్థాయి చర్చలు ఈనెల ద్వితీయార్థంలో జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

"14వ విడత చర్చలకు చైనా వైపు నుంచి ఆహ్వానం అందింది. డిసెంబర్​ ద్వితీయార్థంలో ఈ చర్చలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. 1971 యుద్ధంలో పాకిస్థాన్​పై విజయాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తోన్న గోల్డెన్​ జూబ్లీ ఉత్సవాల్లో డిసెంబర్​ 16 వరకు సైనిక బలగాలు నిమగ్నమై ఉంటాయి. ఆ తర్వాతే చర్చలకు సమయం నిర్ణయించే అవకాశం ఉంది."

- అధికార వర్గాలు

సరిహద్దు సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు 13 దఫాలుగా చర్చలు జరిగాయి. పాంగాంగ్​ సరస్సు ఫ్రిక్షన్​ పాయింట్లు, గోగ్రా హైట్స్​ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయింది. హాట్​ స్ప్రింగ్స్​ వద్ద బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఇదీ సమస్య..

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌పై 2020 మేలో చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గతేడాది జూన్‌ 15న గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో 20మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. చైనా వైపు సైతం మృతుల సంఖ్య భారీగా ఉందని అంచనా. ఈ పరిణామాలతో భారత్‌-చైనా యుద్ధం అంచు వరకు వెళ్లాయి. సరిహద్దు వెంబడి ఇరు దేశాలు బలగాలను పెద్దఎత్తున మోహరించాయి. ఈ తరుణంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండువైపులా అధికారులు రంగంలోకి దిగారు.

ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణే లక్ష్యంగా భారత్​, చైనా చర్చలు

భారత్‌-చైనా సమస్యకేదీ పరిష్కారం?

కమ్ముకొస్తున్న డ్రాగన్​- భారత్​ పరిస్థితి ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.