ETV Bharat / bharat

ఈ ట్విన్స్ రూపంలోనే కాదు.. మార్కుల్లోనూ సేమ్​.. ఒకేసారి ఇద్దరికీ గోల్డ్​ మెడల్స్

author img

By

Published : Dec 25, 2022, 1:58 PM IST

Updated : Dec 25, 2022, 2:18 PM IST

ఆ ఇద్దరు అన్నాదమ్ములు కవలలు. వారిని పోల్చుకోవడం ప్రొఫెసర్లకే కాదు వారి స్నేహితులకి కూడా కష్టమే. ఆ ఐడెంటికల్​ ట్విన్స్​.. రూపంలోనే కాదు చదువులోనూ ఒకేలా రాణిస్తున్నారు. వేర్వేరు విభాగాలు చదువుతున్నా సరే ఒకేలా మార్కులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Identical twin scored same marks
ఐడెంటికల్ ట్విన్స్

బంగాల్​లో ఇద్దరు కవలలు పోలికల్లోనే కాదు.. చదువులోనూ ఒకేలా మార్కులను సంపాదించారు. వారిద్దరూ వేర్వేరు విభాగాల్లో చదువుకున్నా సరే.. ఫలితాల్లో మాత్రం ఒకేలా మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరిచారు. కోల్​కతాలోని జాదవ్​పుర్​ విశ్వవిద్యాలయంలో చదువుతున్న వీరిద్దరూ.. 9.54 జీపీఏ మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్​లుగా నిలిచారు. డిసెంబర్​ 24న జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు, సర్టిఫికెట్​లు అందుకున్నారు.

కోల్​కతా ప్రాంతానికి చెందిన సుభేందు, దివేందు ప్రమాణిక్​లు 5 నిమిషాల తేడాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆడుకోవడం, చదువుకోవడం.. అన్నీ కలిసే చేసేవారు. దీనికి తోడు వీరి ప్రవర్తన కూడా ఒకేలా ఉండేది. పదో తరగతి వరకూ ఇద్దరూ కలిసే చదవుకున్నారు. అయితే ఇంటర్​ ఆపై చదువుల్లో మాత్రం వేర్వేరు సబ్జెక్ట్​లను ఎంచుకున్నారు. విభాగం ఏదైనా సరే ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి.. కోల్​కతాలోని ప్రతిష్ఠాత్మక జాదవ్​పుర్​ యూనివర్సిటీలో చోటు సంపాదించారు.

సుభేందు జియాలజీ విభాగాన్ని ఎంచుకోగా.. దివేందు ఆర్కిటెక్చర్​ ఇంజినీరింగ్​ విభాగాన్ని ఎంచుకున్నాడు. వీరిద్దరి విభాగాలు వేరైనా రోజూ కలిసే చదువుకునేవారు. దీంతో వారిద్దరూ సమానంగా.. 9.54 జీపీఏ మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారు. దివేందు ఐఐటీ-ఖరగ్​పుర్​లో ఉన్నత చదువుని కొనసాగించనుండగా.. సుభేందు జర్మనీ వెళ్లనున్నాడు. దీంతో వీరిద్దరి బంధం కొన్ని రోజుల పాటు తెరపడనుంది.

Last Updated :Dec 25, 2022, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.