ETV Bharat / bharat

పార్లమెంట్​ పాస్​నే ఫోర్జరీ చేసిన ఘనుడు.. చివరకు!

author img

By

Published : Oct 24, 2021, 10:13 AM IST

Updated : Oct 24, 2021, 10:43 AM IST

పార్లమెంట్​ పాస్​ను ఫోర్జరీ చేసినందుకు బిహార్​కు చెందిన ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రజల్ని మోసం చేసేందుకు అతడు నకిలీ పార్లమెంట్​ పాస్​ను సృష్టించినట్టు అధికారులు వెల్లడించారు.

bihar crime news
పార్లమెంట్​ పాస్​నే ఫోర్జరీ చేసిన ఘనుడు.. చివరకు!

బిహార్​ గోపాల్​గంజ్​లో జ్యోతి భూషణ్​ కుమార్, బబ్లూ కుమార్​ ఆర్య మధ్య పరిచయం ఉంది. గతంలో భూషణ్​ కుమార్​ ఓ ఎంపీకి వ్యక్తిగత సిబ్బందిగా విధులు నిర్వర్తించేవాడు. ఆ సమయంలో అతడికి పార్లమెంట్​ పాస్​ కూడా ఉండేది. కానీ అది 2019 జనవరి 31తో ముగిసింది. ఓ రోజు భూషణ్​కు తెలియకుండా అతడి జేబులో నుంచి ఆ పాస్​ను దొంగిలించాడు. ఆ పాస్​ను ఓ ఇంటర్నెట్​ షాప్​లో ఎడిట్​ చేసి నకిలీది సృష్టించాడు బబ్లూ. ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శిగా పాస్​ తయారుచేసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత.. అధికారుల సిఫార్సులు లేకుండానే బబ్లూ ఆర్య అనే వ్యక్తి పేరుతో పార్లమెట్​ పాస్​ను రూపొందించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పార్లమెంట్​లోకి ప్రవేశించేందుకు పాస్​ను ఉపయోగించవచ్చు కాబట్టి భద్రతా పరమైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సీనియర్​ పోలీస్​ అధికారులు రంగంలోకి దిగారు.

గోపాల్​గంజ్​ వెళ్లి బబ్లూను పట్టుకున్నారు. భూషణ్​ను కూడా విచారించారు. దర్యాప్తులో భాగంగా బబ్లూ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టాడు. నకిలీ పాస్​ను ఎలా సృష్టించాడనే విషయాన్ని వివరించాడు. ప్రజలను మోసం చేసేందుకు, తన గురించి తాను గొప్పలు చెప్పుకునేందుకే ఈ పనిచేసినట్టు బబ్లూ వెల్లడించాడు.

ఇదీ చూడండి:- ఐఎస్​ఐ చేతికి భారత ఆర్మీ రహస్యాలు- జవాన్​ అరెస్ట్​

Last Updated :Oct 24, 2021, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.