ETV Bharat / bharat

Power Crisis: 'వదంతులు సృష్టిస్తూ.. విపక్షాల రాజకీయం!'

author img

By

Published : Oct 10, 2021, 5:47 PM IST

Updated : Oct 10, 2021, 6:48 PM IST

Power Crisis, దేశంలో విద్యుత్​ సంక్షోభం, కేంద్ర మంత్రి, energy crisis

దేశంలో విద్యుత్​ సంక్షోభం(Power crisis in India) ఏర్పడనుందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రి ఆర్​కే సింగ్ (RK singh news)​. మరో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. ఈటీవీ భారత్​తో ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడడంతో విద్యుత్‌ సంక్షోభం (Power crisis in India) ఎదుర్కోబోతున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. విద్యుత్‌ సంక్షోభంపై(Power crisis in India) అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని స్పష్టం చేసింది. కేవలం గెయిల్ (GAIL), డిస్కం సంస్థల మధ్య సమాచారలోపం వల్లే ఇలాంటివి ఏర్పడినట్లు పేర్కొంది. దేశరాజధాని దిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరాకు ప్రమాదం ఏర్పడనున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌(RK singh news) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈటీవీ భారత్​తో ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలే వదంతులు సృష్టిస్తూ.. రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ఈటీవీ భారత్​తో కేంద్రమంత్రి ఆర్​కే సింగ్​

'విద్యుత్‌ సంక్షోభం(Power crisis in India) ఎదుర్కోబోతున్నట్లు అనవసర భయాందోళనలు సృష్టించారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ గ్యాస్‌ సరఫరా కూడా తగ్గదు. విద్యుత్‌ అవసరమైన వారు కోరితే వారికి సరఫరా చేస్తాం' అని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌(RK singh news) వెల్లడించారు. దేశంలో విద్యుత్‌ సంక్షోభానికి కారణమయ్యే సరఫరా, వినియోగం మధ్య ఎలాంటి అగాధం లేదని స్పష్టం చేశారు. విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన గ్యాస్‌ అందించాలని ఇప్పటికే గెయిల్‌ సీఎండీకి ఆదేశించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఎన్‌టీపీపీ, బీఎస్‌ఈఎస్‌లతో పాటు విద్యుత్‌ మంత్రిత్వశాఖ అధికారులతో ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆర్‌కే సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందంటూ వినియోగదారులకు సమాచారాన్ని పంపడం పట్ల కొన్ని సంస్థలను హెచ్చరించినట్లు కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ సంస్థ గెయిల్‌ కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల వారిని కూడా మందలించినట్లు సమాచారం.

దేశ రాజధాని దిల్లీ(Power crisis in Delhi), పంజాబ్‌లలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా కనిష్ఠ స్థాయికి చేరాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం విద్యుత్తు ఉత్పత్తి ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా దేశంలోని 135 థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు మూడు రోజుల అవసరాల కంటే తక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో కేంద్రం చాలినంతగా బొగ్గు సరఫరా చేయట్లేదంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కొద్దిపాటి బొగ్గు నిల్వలూ వేగంగా అడుగంటుతున్నాయని, రానున్న రోజుల్లో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు మూతపడడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, దిల్లీలో బొగ్గు నిల్వలపై (Power crisis in Delhi) ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిలో విద్యుత్తు సంక్షోభం తలెత్తకుండా వెంటనే బొగ్గు, గ్యాస్‌ సరఫరా చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. మూడు నాలుగు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయని చెప్పారు. తాజాగా విద్యుత్‌శాఖ మంత్రి మాత్రం దేశంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడనుందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అవన్నీ అనవసర భయాందోళనలేనని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: 'బొగ్గు సరఫరా పెంచుతున్నాం.. కరెంటు సంక్షోభాన్ని తప్పిస్తాం'

Delhi power crisis: దిల్లీలో ఇక రెండు రోజులే.. ఆ తర్వాత!

Last Updated :Oct 10, 2021, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.