'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సంభాషించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బోర్డు ఎగ్జామ్స్లో విద్యార్థులు.. ఒత్తిడిని జయించేందుకు దిల్లీలోని తాల్కటోరా స్టేడియం వేదికగా సలహాలు, సూచనలు ఇచ్చారు.
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అవుతుందో లేదో అన్న అనుమానంతో కార్యక్రమానికి వెళ్లకుండా ఉండలేదన్నారు. ప్రయోగం విఫలమైతే బాగుండదని సన్నిహితులు వారించారన్నారు. అయితే విఫలమైతే స్ఫూర్తి నింపడం కోసమైనా అక్కడ ఉండేందుకు మొగ్గు చూపానన్నారు. ప్రయోగ వేదిక వద్ద ఉండి అక్కడున్నవారిలో స్ఫూర్తి నింపేందుకు యత్నించానన్నారు. ఇదే విధమైన స్ఫూర్తితో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలన్నారు.
"చంద్రయాన్ కోసం రాత్రంతా మీరు మేల్కొన్నారు. మీరే చేశారనుకుని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ప్రయోగం విజయవంతం కాని కారణంగా భారత్ మొత్తం నిరాశ చెందారా లేదా? రాత్రంతా మేల్కొని ఎదురుచూశాం. అప్పుడప్పుడు అలా వైఫల్యం మనలను నిరాశపరుస్తుంది. ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నాను. మీకో రహస్యం చెప్పాలి. కొంతమంది సన్నిహితులు అక్కడికి వెళ్లొద్దన్నారు. ప్రయోగం విజయవంతం కాకుంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. అయితే నేను చెప్పాను. అందుకోసమే నేనక్కిడికి వెళ్లాలని సమాధానమిచ్చాను."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
సంతృప్తినిచ్చిన కార్యక్రమం పరీక్షా పే...
ప్రధానిగా అనేక కార్యక్రమాల్లో తాను భాగం అవుతానని, అయితే తనకు అత్యధికంగా సంతృప్తినిచ్చింది పరీక్షా పే చర్చ కార్యక్రమమన్నారు మోదీ.
దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల నుంచి 2,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చర్చలో పాల్గొనేందుకు దాదాపు 2.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వ్యాసరచన పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా 1,050 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
ఇదీ చూడండి: కేంద్ర మంత్రి క్రికెట్ ఆడితే ఇలా ఉంటుంది!