ETV Bharat / bharat

జీతం అడిగినందుకు ఉద్యోగి సజీవ దహనం

author img

By

Published : Oct 26, 2020, 6:40 PM IST

Updated : Oct 26, 2020, 7:04 PM IST

తాను చేసిన పనికి వేతనం అడిగినందుకు ఉద్యోగిని... సజీవ దహనం చేశాడు ఓ యజమాని. ఈ దారుణం రాజస్థాన్​లో జరిగింది.

Man set on fire for demanding salary in Rajasthan
జీతం అడిగినందుకు ఉద్యోగి సజీవ దహనం

చేసిన పనికి వేతనం అడిగిన ఉద్యోగిని సజీవ దహనం చేశాడు ఓ మద్యం షాపు యజమాని. ఈ ఘటన రాజస్థాన్​ అల్వార్​ నగరంలోని ఖైర్​థల్​లో జరిగింది.

ఇదీ జరిగింది

కమలేశ్​ అనే వ్యక్తి... ఉపాధి కోసం ఓ మద్యం దుకాణంలో పనిలో చేరాడు. తాను చేసిన కష్టానికి యజమాని జీతం చెల్లించకపోయిన.. నమ్మకంతో ఐదు నెలలు పని చేశాడు. అయినా యజమాని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో తన జీతం చెల్లించాలని డిమాండ్​ చేశాడు కమలేశ్​.

జీతం ఇవ్వలేదు సరికదా... కమలేశ్​పై పెట్రోలు పోసి నిప్పంటించాడు యజమాని, కమలేశ్​ సహచరులు. తనను తాను రక్షించుకోవడానికి డీప్​ ఫ్రిజ్​లోకి వెళ్లాడు బాధితుడు​. అప్పటికే పూర్తిగా కాలిపోయిన కమలేశ్​... అందులోనే ప్రాణాలు విడిచాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. దీనిపై అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందని ఆరోపించాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి: హిమాచల్​ప్రదేశ్​లో భారీగా మంచు వర్షం

Last Updated :Oct 26, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.