ETV Bharat / bharat

పెళ్లికి వెళ్తూ ఆరుగురు మృతి, ఐదుగురు ఒక కుటుంబానికి చెందినవారే

author img

By

Published : Aug 14, 2022, 4:12 PM IST

ఎదురెదురుగా వస్తున్న కారు, టెంపో ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు రోడ్డు పక్కనే ఆగి ఉన్న డంపర్​ను కారు ఢీకొట్టింది. గుజరాత్​లో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.

beed road accident
బీడ్​లో రోడ్డు ప్రమాదం

Beed road accident మహారాష్ట్ర.. బీడ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, టెంపో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మంజర్సుంబ- పటోడా హైవేపై ఆదివారం ఉదయం 5.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీడ్​ జిల్లా కేజ్ సమీపంలోని జివాచివాడి గ్రామానికి చెందిన ఓ కుటుంబం పుణెలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న టెంపో ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురిలో ఒకే కుటుంబానికి చెందినవారు ఐదుగురు ఉన్నారు. రెండు వాహనాలను వేరు చేసేందుకు పోలీసులు క్రేన్‌ను ఉపయోగించారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..
గుజరాత్​.. భావ్​నగర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వల్లభిపుర్ సమీపంలోని హైవేపై ఆగి ఉన్న డంపర్ ట్రక్కును కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటలకు జరిగిందని పోలీసులు తెలిపారు.

మృతులు సూరత్​ నుంచి అమ్రేలీ జిల్లాలోని తమ స్వగ్రామమైన ఝరాకియాకు వెళ్తుండగా.. వారి కారు పక్కనే ఆగి ఉన్న డంపర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు, వారి 15 ఏళ్ల కుమారుడు అక్కడికక్కడే మరణించాడు. దంపతుల మేనల్లుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ భావ్​నగర్ ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: ఆడ కోతి ప్రేమను ఎరగా వేసి రౌడీ కోతిని బంధించిన అధికారులు

జెండా ఎగురవేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.