ETV Bharat / bharat

Army Vehicle Accident Today : లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. 9 మంది సైనికులు మృతి

author img

By

Published : Aug 19, 2023, 8:56 PM IST

Updated : Aug 19, 2023, 10:55 PM IST

Army Vehicle Accident Today : లద్ధాఖ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది సైనికులు మరణించారు. ఆర్మీ సైనికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పలువురు విచారం వ్యక్తం చేశారు.

army-vehicle-accident-today-army-vehicle-plunges-into-deep-gorge-in-ladakh-several-died
లోయలో పడ్డ ఆర్మీ వాహనం.

Army Vehicle Accident Today : సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది సైనికులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్ధాఖ్​లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఓ జవాన్​ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమం​గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Army Vehicle Accident Ladakh : పది మంది సైనికులతో కూడిన ఓ ఆర్మీ వాహనం సాయంత్రం 4.45 గంటల ప్రాతంలో అదుపుతప్పి లోయలో పడిందని అధికారులు తెలిపారు. లేహ్​ సమీపంలో ఉన్న నియోమాలోని కెరీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వారు వెల్లడించారు. ఎనిమిది సైనికులు ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మరో సైనికుడు చికిత్స పొందుతున్నాడని అధికారులు పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు రాజ్​నాథ్​ సంతాపం..
ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ విచారం వ్యక్తం చేశారు. సైనికుల సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. గాయపడిన జవాన్​ తొందరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

  • Saddened by the loss of Indian Army personnel due to an accident near Leh in Ladakh. We will never forget their exemplary service to our nation. My thoughts are with the bereaved families. The injured personnel have been rushed to the Field Hospital. Praying for their speedy…

    — Rajnath Singh (@rajnathsingh) August 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ దుర్ఘటన బాధాకరం : అమిత్‌ షా
లద్దాఖ్‌లో జరిగిన ప్రమాదంలో వీర సైనికులను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. ఈ విషాద సమయంలో యావత్‌ దేశమంతా మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన భరోసా నింపారు. అమరులైన జవాన్లకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటనలో గాయపడిన జవాన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అమిత్ షా ట్వీట్ చేశారు.

  • Deeply saddened by the tragic road accident in Ladakh in which we lost our valiant soldiers, as their vehicle fell into a gorge. The entire nation stands shoulder to shoulder with the bereaved families in this hour of grief. My sincerest condolences to them. May the injured…

    — Amit Shah (@AmitShah) August 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విచారం వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి..
లద్దాఖ్‌లో జరిగిన ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా విచారం వ్యక్తంచేశారు. భారతమాత వీరపుత్రులకు వినయపూర్వకంగా నివాళులర్పిస్తున్నట్టు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. ఈ తీరని బాధను తట్టుకొనే శక్తిని మృతుల కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్టు యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు.

  • लद्दाख में सड़क दुर्घटना में सेना के जवानों का निधन अत्यंत कष्टदायक है। माँ भारती के वीर सपूतों को विनम्र श्रद्धांजलि!

    प्रभु श्री राम से दिवंगत पुण्यात्माओं की शांति और घायल जवानों के शीघ्र स्वास्थ्य लाभ की कामना है। भगवान शोक संतप्त परिजनों को यह अथाह दुःख सहने की शक्ति दें।

    — Yogi Adityanath (@myogiadityanath) August 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇంటర్​సిటీ ట్రైన్​కు తప్పిన పెను ముప్పు.. ఇంజిన్​లో మంటలు.. లోకోపైలట్ అప్రమత్తతతో..

విద్యార్థులే సేవకులు!.. విసనకర్రతో గాలి విసిరించుకున్న మహిళా టీచర్లు..

Last Updated : Aug 19, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.