ఆ లెక్కల్లో దేశంలోనే తెరాస​ టాప్- మూడో స్థానంలో వైకాపా

author img

By

Published : Oct 11, 2021, 4:31 PM IST

ADR

ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా విరాళాలు పొందడంలో తెరాస​.. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లోనే అగ్రగామిగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని విరాళాల రూపంలో అర్జించింది. మూడో స్థానంలో వైకాపా ఉంది. మొత్తం 42 పార్టీలపై ఏడీఆర్​ నివేదిక రూపొందించగా.. 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టాయి.

2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సమితి​, వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ పార్టీ, ఆప్​, డీఎంకే సహా 14 ప్రాంతీయ పార్టీలకు.. ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా రూ. 447.49కోట్లు విరాళాలుగా అందాయి. అన్నింటినీ కలుపుకుంటే.. ఆయా పార్టీల ఆదాయంలో ఈ మొత్తం 50.97శాతం. ఏడీఆర్​(అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​) ఈమేరకు ఓ నివేదిక రూపొందించింది.

2019-20 కాలానికి మొత్తం 42 ప్రాంతీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలను విశ్లేషించింది ఏడీఆర్​. మొత్తం ఆదాయం రూ. 877.957కోట్లుగా తేలింది. ఈ 42 పార్టీల్లో 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టినట్టు ఏడీఆర్​ స్పష్టం చేసింది.

తెరాస​ టాప్​...

  • ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందడంలో తెరాస​ టాప్​లో నిలిచింది. ఆ పార్టీ ఆదాయం రూ. 130.46కోట్లు. విశ్లేషణకు పరిగణించిన అన్ని పార్టీల మొత్తం ఆదాయంలో ఒక్క తెరాస వాటానే 14.86శాతం.
  • తర్వాతి స్థానాల్లో.. శివసేన(రూ. 111.403కోట్లు-12.69శాతం), వైకాపా(రూ. 92.739కోట్లు-10.56శాతం) ఉన్నాయి.
  • 39 పార్టీల మొత్తం ఆదాయం.. 2018-19(రూ. 1087.206కోట్లు)తో పోల్చుకుంటే.. 2019-20లో(రూ. 874.467కోట్లు) తగ్గింది. ఇది 19.57శాతం.
  • 2019-20లో అందిన ఆదాయాన్ని 24 ప్రాంతీయ పార్టీలు ఇంకా ఖర్చుపెట్టలేదు. తెరాస​ మొత్తం ఆదాయంలో 83.76శాతాన్ని ఇంకా ఖర్చు చేయలేదు. అన్నాడీఎంకే, జేజేపీకి 67.82, 64శాతం ఆదాయం మిగిలే ఉంది.
  • 2019-20కి గాను 18 పార్టీలు.. తమ ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేశాయి. తెలుగు దేశం పార్టీ, బిజూ జనతా దళ్, డీఎంకే, ఎస్​పీ, జేడీఎస్​, ఏజేఎస్​యూ, జేవీఎం-పీ, ఐఎన్​ఎల్​డీ, పీఎంకే, ఎంజీపీ, జీఎప్​పీ, ఎస్​డీఎఫ్​, ఎంఎన్​ఎఫ్​, ఏఐఎఫ్​బీ, ఎన్​పీఎఫ్​, జేకేపీడీపీ, ఐపీఎఫ్​టీ, ఎంపీసీ ఈ జాబితాలో ఉన్నాయి. బీజేడీ ఎక్కువ ఖర్చు చేసింది(106.01శాతం/ రూ. 95.78కోట్లు).

ఇవీ చూడండి:-

పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్​కు దెబ్బ.. భాజపాకు లాభం!

'గుర్తు తెలియని వ్యక్తుల' నుంచే జాతీయ పార్టీలకు ఆదాయం!

ADR report: 363 మంది శాసనకర్తలపై నేరాభియోగాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.