ఎన్నికల్లో పారించేందుకు 4వేల లీటర్ల మద్యం - పకడ్బందీగా పట్టుకున్న పోలీసులు - LIQUOR SEIZED IN HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 11:25 AM IST

thumbnail

RS.37 Lakhs Worth Liquor Seized in Hyderabad : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారులు విస్తృత సోదాలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. అనధికారికంగా తరలిస్తున్న వాటిని సీజ్​ చేస్తున్న అధికారులు వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు. 

నిబంధనలు అతిక్రమించి రవాణా చేస్తున్న రూ.37 లక్షల విలువ గల నాలుగు వేల లీటర్ల మద్యాన్ని సైబరాబాద్​ ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. బాచుపల్లి పీఎస్​ పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న 2597.88 లీటర్లను  స్వాధీనం చేసుకున్నారు. పేట్​ బషీరాబాద్​ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 1916.2 లీటర్ల మద్యంతో పాటు మనీ లాజిస్టిక్ వాహనంలో నిబంధనలు అతిక్రమించి ఎటువంటి క్యూ ఆర్ కోడ్​ లేకుండా రూ.1.24 లక్షల రూపాయలను తరలిస్తుండగా ఎస్​వోటీ పోలీసులు పట్టుకుని సీజ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.