జగనన్న రాకముందే సభా ప్రాంగణం ఖాళీ - వైన్స్​ వద్దే వైఎస్సార్సీపీ కార్యక్తలు - No Public in Jagan public Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 1:46 PM IST

thumbnail

No Public in CM Jagan Meeting at Anakapally District : వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్​ అనకాపల్లి జిల్లా చోడవరంలో సభ నిర్వహించారు. అయితే జగన్​ ప్రచార సభ విఫలమైంది. ఉదయం ఎనిమిది గంటలకు సమావేశం అని చెప్పడంతో వివిధ ప్రాంతాల ప్రజలు సభా ప్రాంగణానికి హాజరయ్యారు. అయితే జగన్ 11 గంటలు దాటిన తర్వాత హెలికాప్టర్లో వచ్చినప్పటికీ సభ ప్రారంభానికి ముందే జనాలు తిరుగు ముఖం పట్టారు. ఓ పక్క జగన్ ప్రసంగిస్తుండగా చోడవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద వైఎస్సార్సీపీ కార్యక్తలు బారులు తీరడం పలువురిని ఆశ్చర్యపరిచింది. 

CM Jagan Public Meeting Failed In Chodavaram : సీఎంకి తమ బాధలు చెప్పుకుందామని వచ్చినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించకపోవటంతో వెళ్లిపోతున్నామని పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. తాము నిరంతరం కష్టపడుతున్నప్పటికీ ఆశాజనకమైన వేతనాలు అందించడానికి తాము ఎన్నో మార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేదని పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.