సింగరేణిలో కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు - Sridhar Babu Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 7:13 PM IST

thumbnail

Minister Sridhar Babu Election Campaign in Peddapalli : సింగరేణిలో కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేసి, ఉపాధి కల్పిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బృందావన్ గార్డెన్ ఐఎన్​టీయూసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కాకా వెంకటస్వామి మనుమడు వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కలను రామగుండం నుంచే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి స్థలాల్లో ఇల్లు ఉన్న కార్మిక కుటుంబాలకు పూర్తిస్థాయిలో పట్టాలిప్పిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.