సమ్మక్క తల్లి ఆగమనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి : మంత్రి సీతక్క

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 3:44 PM IST

thumbnail

Medaram Sammakka Saralamma Jatara 2024 : సమ్మక్క - సారలమ్మల నామస్మరణతో గిరిజన జనజాతర మేడారం పులకించిపోతోంది. కోట్లాది భక్తులు తమ ఇలవేల్పులకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలు సమర్పిస్తున్నారు. అశేష జనవాహినికి అభయమిచ్చేందుకు సమ్మక్క తల్లి రానున్న వేళ గద్దె వద్ద అలంకరణ పూర్తైంది. చిలకల గుట్ట నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా డోలు వాద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా తీసుకురానున్నారు.

Sitakka In Medaram : మేడారం జాతరను ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళాగా మంత్రి సీతక్క వర్ణించారు. దేశంలో జరిగే కుంభమేళా కిలోమీటర్ల పొడవైన నదిలో 12 రోజులు సాగుతుందని మేడారంలో కేవలం 4 రోజుల్లోనే కోట్లాది మంది భక్తులు తరలి వస్తారని వెల్లడించారు. సమ్మక్క తల్లి ఆగమనానికి వీలుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సీతక్క తెలిపారు. రేపు ఉదయం గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తదితరులు వనదేవతలు దర్శనానికి వస్తున్నట్లు మంత్రి సీతక్క వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.