LIVE : బీజేపీ మెదక్​ ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావు మీడియా సమావేశం - Raghunandhan Rao Press Meet

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 1:09 PM IST

Updated : Apr 23, 2024, 1:26 PM IST

thumbnail

Medak BJP Candidate Raghunandhan Rao in  Press Meet Live : హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై మండిపడ్డారు. ఆరు గ్యారంటీల పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఏమార్చి ఓట్లు దండుకుందని ఆరోపించారు. ఇప్పుడేమో పాంచ్ న్యాయ్ అంటూ మరో అబద్ధానికి తెరలేపి మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శించారు. బీజేపీకి అవకాశమిస్తే, మోదీ మరోసారి ప్రధాని అవుతారని తెలిపారు. మోదీ మళ్లీ పీఎం అయితే దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. మరోవైపు సీఎం రేవంత్​ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికల వేళ ఏదైనా మాట్లాడతాం అంటే సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని రఘునందన్ సూచించారు.ఇటీవల ఆదిలాబాద్‌లో మోదీని పెద్దన్న అన్నది రేవంత్‌రెడ్డే అని గుర్తు చేశారు.

Last Updated : Apr 23, 2024, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.