లక్కీ ఉమెన్​- రైలు పట్టాల మధ్య ఉండిపోయిన మహిళ- సేఫ్​గా బయటకు!

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 5:16 PM IST

thumbnail

Goods Train Runs Over Woman In Bihar : ఆగి ఉన్న గూడ్స్​ రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ట్రాక్​ మధ్య ఇరుక్కుపోయింది. అనంతరం అకస్మాత్తుగా రైలు కదిలింది. కానీ చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటన బిహార్​లోని బత్నాహా రైల్వే స్టేషన్​లో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్​గా మారింది. 

ఇదీ జరిగింది
అరారియాలోని బత్నాహా​కు చెందిన కనకలతా దేవి అనే మహిళ స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్​లో లైన్​ నంబర్ 5పై ఆగిఉన్న గూడ్స్ ​రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే రైలు కదిలింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు ఆమెను వంగమని సూచించారు. వెంటనే అప్రమత్తమైన మహిళ రైలు వెళ్లేంతవరకు అక్కడే పడుకుని ప్రాణాలు కాపాడుకుంది. మహిళ ప్రాణాలతో బయటపడటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ మహిళ బావ, కుమారుడు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించారని ఆమెను దేవుడే రక్షించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రయాణీకులు ట్రాక్​ల వద్ద జాగ్రత్తగా ఉండాలని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రాహుల్ కుమార్ కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.