భక్త జనసంద్రమైన యాదాద్రి ఆలయం - దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : May 25, 2024, 1:09 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-05-2024/640-480-21555132-thumbnail-16x9-yadadri.jpg)
Devotees Rush in Yadadri Temple : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిని ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి.
Yadadri Lakshmi Narasimha Swamy Temple Rush : ఆలయంలో స్వామివారి అభిషేక పూజల్లో, నిత్య కల్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ప్రసాద విక్రయశాల, ఆలయ ఆవరణలో భక్తుల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.