వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి పిటిషన్‌పై విచారణ వాయిదా - Dastagiri Petition Postponed

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 9:14 PM IST

thumbnail

Dastagiri Petition Adjourned for Hearing in CBI Court : వివేకా హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలన్న దస్తగిరి పిటిషన్​పై మళ్లీ వాదనలు వినాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. అప్రూవర్​గా మారినందున తనను నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షుల్లో చేర్చాలని కోరుతూ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ (Dastagiri Petition in CBI court) వేశారు. గత నవంబరు 4 నుంచి దస్తగిరితో పాటు నిందితుల వాదనలు విన్న న్యాయస్థానం మార్చి 28న ఉత్తర్వులు వెల్లడించనున్నట్లు వెల్లడించింది. అయితే సీబీఐ కూడా వాదనలు వినిపించాలంటూ ఏప్రిల్ 8న పిటిషన్​ను మళ్లీ తెరిచింది. సీబీఐ వాదనలు కూడా ముగియడంతో ఇవాళ తీర్పు వెల్లడించనున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల తీర్పు సిద్ధం కాలేదని న్యాయమూర్తి సీహెచ్ రమేష్ బాబు తెలిపారు. జడ్జి బదిలీ అయినందున పిటిషన్​పై మళ్లీ ఇరువైపుల వాదనలు వినేందుకు మే 17కి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.