అర్వింద్​ను గెలిపించండి - నోరు జారిన ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్​ గౌడ్​ - సోషల్​ మీడియాలో వీడియో వైరల్ - MAHESH KUMAR GOUD VIRAL VIDEO

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 4:18 PM IST

thumbnail

Congress Mahesh Kumar Goud Controversy Statement : కాంగ్రెస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​, ఎమ్మెల్సీ మహేశ్​​ కుమార్​ గౌడ్​ నోరు జారారు. శనివారం నిజామాబాద్​లో నిర్వహించిన కాంగ్రెస్​ కార్యకర్తల సమావేసంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి అర్వింద్​ను గెలిపించండి, కేంద్రమంత్రిని చేసుకుందాం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​ రెడ్డికి బదులు అర్వింద్​ పేరును మహేశ్​​ కుమార్​ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై కొందరు పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో, అదీ సభల్లో పార్టీ అభ్యర్థి పేరు మరచి ఇతరుల పేర్లతో ఎలా ప్రస్తావిస్తారని మండిపడుతున్నారు.  

నిజామాబాద్​ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ సీరియస్​గా తీసుకుంది. ఎంపీ అర్వింద్​ను ఓడించి ఆ స్థానంలో కాంగ్రెస్​ జెండా ఎగురవేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకే ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డిని ఎన్నికల బరిలో దించింది. మరోవైపు రాష్ట్రంలో బీఆర్​ఎస్​ రాజకీయ నిలకడ కోల్పోతుంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సైతం ఇతర పార్టీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్​ మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.