LIVE : మెదక్​ 'జనజాతర' సభలో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్షప్రసారం - CM Revanth Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 7:11 PM IST

Updated : Apr 26, 2024, 8:33 PM IST

thumbnail

CM Revanth At Medak Jana Jatara Sabha Live : రాష్ట్రంలో అత్యధిక లోక్​సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో విస్త్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెదక్​​ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్నారు. మెదక్​ కాంగ్రెస్ పార్లమెంట్అభ్యర్థి నీలం మధుకు మద్ధతుగా సీఎం ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఏఐసీసీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం పలు విమర్శలు గుప్పించారు.                                        

Last Updated : Apr 26, 2024, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.