LIVE : మల్కాజిగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ - lok sabha elections 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 9:50 PM IST

thumbnail

CM Revanth Malkajigiri Corner Meet LIVE : రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, మెజార్టీ లోక్​సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో, ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ మల్కాజిగిరిలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అంతకు ముందు ఎల్బీనగర్ రోడ్ షో నిర్వహించిన అనంతరం మల్కాజిగిరిలో కార్నర్ మీటింగ్​లో పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా మహేందర్​రెడ్డిని భారీ మెజార్టీతో  గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం రెండు కలిసి పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సరైన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.