LIVE : కరీంనగర్​లో బండి సంజయ్ నామినేషన్ ర్యాలీ - BANDI SANJAYA NOMINATION RALLY LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 11:46 AM IST

Updated : Apr 25, 2024, 1:03 PM IST

thumbnail

BJP Live : తెలంగాణలో అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ నేతల దిశానిర్దేశంతో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ, ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కార్ ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా మరికొందరు నామపత్రాలు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.తాజాగా నేడు కరీంనగర్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ తర్వాత ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ నుంచి టవర్ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తూ టవర్ సర్కిల్ వద్ద నేతలు ప్రసంగిస్తున్నారు.ఈ కార్యక్రమం అనంతరం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌కు వెళ్లనున్నారు. అక్కడ నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి భరత్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరోవైపు నిజామాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి హాజరుకానున్నారు. సభ అనంతరం అర్వింద్‌ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. వరంగల్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి పాల్గొననున్నారు.

Last Updated : Apr 25, 2024, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.