LIVE : అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం - ప్రత్యక్ష ప్రసారం
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jan 22, 2024, 10:07 AM IST
|Updated : Jan 22, 2024, 3:33 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-01-2024/640-480-20564982-thumbnail-16x9-lordram.jpg)
Ayodhya Ram Mandir Pran Pratishtha LIVE : శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరంలో రాములోరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు కన్నుల పండువుగా జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం శుభముహూర్తం 12 గంటల 20 నిమిషాలకు అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది. ఒంటిగంటకు పూర్తైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సాధుసంతువులు, ప్రముఖులు కలిపి ఏడు వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 జంటలు ప్రాణప్రతిష్ఠకు అతిథేయులుగా వ్యవహరించారు.
సంప్రదాయాన్ని అనుసరించి వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని వైవిధ్యమైన పూలతోనూ, రంగు రంగుల విద్యుద్దీపాలతోనూ అలంకరించారు. శ్రీరాముడి భవ్య మందిరాన్ని జీ+2 పద్దతిలో నిర్మించారు. భక్తులు తూర్పున 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయంలోకి చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఆలయ సముదాయాన్ని ఆధునికంగా తూర్పు నుంచి పశ్చిమానికి 380 అడుగులతో సంప్రదాయ నగర విధానంలో నిర్మించారు.