చెత్త కొనుగోలుకు లంచం- ఏసీబీకి చిక్కిన ఏఈ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 1:20 PM IST

thumbnail

Anti Corruption Bureau Rides in Vijayawada Vehcle Depo : విజయవాడ నగరపాలక సంస్థ వెహికల్ డిపో ఇన్​ఛార్జ్​ ఏఈ ఈశ్వర్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. వెహికల్ డిపో ఈఈ కార్యాలయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్​ఛార్జ్​ ఏఈగా తోట ఈశ్వర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు నగరపాలక సంస్థ నుంచి కొనుగోలు చేసే కాంట్రాక్టర్ (Contractor) షేక్ సద్దాం హుస్సేన్ నుంచి రూ. 50,000 డిమాండ్​ చెయ్యగా, లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్​ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 

పక్కా ప్రణాళికతో ఏసీబీ (Anti Corruption Bureau) డీఎస్పీ ఈశ్వర్​ని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు ఉండగా దానికి సంబంధించిన వర్క్ ఆర్డర్ అగ్రిమెంట్ తయారు చేసే క్రమంలో ఏఈ ఈశ్వర్ లంచం అడిగినట్లు అధికారులు తెలిపారు. ఓ వార్డు సచివాలయ ఉద్యోగిగా ఉన్న ఈశ్వర్​ను వెహికల్ డిపో (Vehcle Depo) ఉన్నతాధికారిగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్​ఛార్జ్​ ఏఈ గా కొనసాగిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.