Woman Killed Her Son In Nagar Kurnool : ఏ తల్లీ చేయని పని ఆమె చేసింది. భర్తతో నెలకొన్న వివాదంలో క్షణికావేశంలో కన్న కుమారుడినే కడతేర్చింది ఓ మాతృమూర్తి. ఈ అమానవీయ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి(Bijinepalli) మండలం అల్లిపూర్లో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లి ఆవేశంలో తన కొడుకునే హతమార్చింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం అల్లిపూర్కు చెందిన లక్ష్మికి గత కొంతకాలంగా భర్తతో మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు(Disputes) జరుగుతున్నాయి. ఈరోజు కూడా తెల్లవారుజామున భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే ఆవేశం తట్టుకోలేక లక్ష్మి తన ఎనిమిదేళ్ల కొడుకు డేగ హరికృష్ణని చితకబాదింది. తలను గోడకేసి కొట్టింది. దీంతో గాయాలపాలై తీవ్ర రక్తస్రావం జరిగి హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు బాలుడి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ సంఘటనపై బిజినేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ (Nagar Kurnool) జిల్లా ఆసుపత్రికి తరలించారు.
"భార్యాభర్తలిద్దరికీ ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆమె చిన్నకుమారుడైన హరికృష్ణ తల్లిదండ్రుల వద్దే ఉంటూ అదే గ్రామంలో చదువుకుంటున్నాడు. గత కొద్దిరోజులుగా డేగ లక్ష్మికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమసంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి ఆ వ్యక్తికి హెచ్చరించారు. లక్ష్మి తన కుమారుడిని అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో అతడిపై గొట్టంతో కొడుకు తలపై కొట్టి గొడకు అదిమి కొట్టిచంపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం- కనకయ్య, సీఐ
మూడేళ్ల కుమారుడిని చంపిన తల్లి
కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని పేట్బషీరాబాద్ పరిధి పార్సీగుట్టలో జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల కుమారుడిని తల్లి చంపేసింది. ఆమె ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య - ప్రేమ వ్యవహారం నచ్చక కుమార్తెను కొట్టి చంపిన తల్లి
సెల్ఫోన్ కోసం నానమ్మను హత్య చేసిన మనవడు - మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చేశాడు
కళ్లెదుటే భర్తను హత్య చేసిన మేనల్లుడు - గుండెపోటుతో భార్య మృతి