ETV Bharat / state

జగన్​పై దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - Stone Attack on Jagan in AP

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 1:18 PM IST

Stone Attack on Jagan in AP
Stone Attack on Jagan in AP

Stone Attack on Jagan in AP : ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు యువకులు సీసీఎస్‌ పోలీసుల అదుపులో అనుమానితులు ఉన్నట్లు సమాచారం. సిట్​ వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Stone Attack on Jagan in AP : ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు, స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్​ ఆధ్వర్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని సీసీఎస్​ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.