ETV Bharat / state

ప్రచారాన్ని ముమ్మరం చేసిన తెలుగుదేశం నేతలు - TDP leaders Election campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 9:35 PM IST

Ruling opposition party Leaders' campaign
Ruling opposition party Leaders' campaign

Ruling opposition party Leaders' campaign: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అటు వైసీపీ, ఇటీ కూటమి నేతలు ప్రచార వేగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు మెుదలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమావేశమయ్యారు.

Ruling opposition party Leaders' campaign: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రచారంలో రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. తమకే ఓటు వేయాలంటూ కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటూ, పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయి.

విధ్వంసం చేయడమే జగన్ అజెండా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమావేశమయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని, రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్ అజెండా అని లోకేశ్ విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తానన్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్‌ వాసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ అభ్యర్థి మురుగుడు లావణ్యతో కలిసి ప్రచారానికి వెళ్లిన ఆర్కే ను సొంత పార్టీ సానుభూతిపరులే నిలదీశారు. రాజధాని విషయంలో తాము తీవ్రంగా నష్టపోయామని ఆళ్లకు వివరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదలలో తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విస్తృత పర్యటన చేపట్టారు. నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు.
వైసీపీ కొనసాగుతున్న షాక్​ల పర్వం- ఫ్యాన్​ను వీడి సైకిల్ ఎక్కుతున్న నేతలు - YSRCP Leaders Join In To TDP

ప్రచారాన్ని ముమ్మరం చేసిన తెలుగుదేశం నేతలు

ఇంటింటి ‌ప్రచారంలో టీడీపీ నేతలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్‌, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కిలిసి ప్రచారం చేశారు. వ్యాపారులతో మాట్లాడారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. తణుకులో తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటి ‌ప్రచారం చేశారు. ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. తన భర్తను గెలిపించాలంటూ, ఆరిమిల్లి రాధాకృష్ణ భార్య కృష్ణతులసి గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తెలుగుదేశం అభ్యర్థి వంగలపూడి అనిత మండలంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాబు సూపర్ సిక్స్ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించారు. చిన్న నరసాపురంలో తెలుగుదేశంలోకి పెద్ద సంఖ్యలో చేరికలు జరిగాయి.

వైసీపీని వీడిన 60 కుటుంబాలు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని కొన్ని గ్రామాల నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వీరికి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియెజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో, 60 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి.

జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్, జయకృష్ణ - Mandali Buddha Prasad into Janasena

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.