ETV Bharat / politics

వైసీపీ కొనసాగుతున్న షాక్​ల పర్వం- ఫ్యాన్​ను వీడి సైకిల్ ఎక్కుతున్న నేతలు - YSRCP Leaders Join In To TDP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 10:27 PM IST

Updated : Mar 31, 2024, 10:56 PM IST

YSRCP Leaders Join In To TDP
YSRCP Leaders Join In To TDP

YSRCP Leaders Join In To TDP: సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు. వైఎస్సార్సీపీలో సరైన ప్రధాన్యత లేకపోవడంతోనే టీడీపీలోకి చేరామన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని నేతలు భరోసా ఇచ్చారు.

YSRCP Leaders Join In To TDP : సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు. వైఎస్సార్సీపీలో సరైన ప్రధాన్యత లేకపోవడంతోనే టీడీపీలోకి చేరామన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని నేతలు భరోసా ఇచ్చారు.

ముమ్మిడివరం నియోజకవర్గం : కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 500మత్స్యకార కుటంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీ అభ్యర్థి దాట్ల బుజ్జిబాబు, జనసేనికులు మత్స్యకారులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లోని మత్స్యకారులు టీడీపీ అభ్యర్థి దాట్ల బుజ్జిబాబుకు మద్దతు తెలియజేశారు. తమ ప్రభుత్వం రాగానే జిల్లాలోని మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని బుచ్చిబాబు హామీ ఇచ్చారు.

భీమునిపట్నం : విశాఖ జిల్లా భీమునిపట్నంలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో విధివిధానాలు నచ్చకపోవడంతోనే పార్టీని వీడామని వెంకటప్ప తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. త్వరలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని వెంకటప్ప తెలిపారు.

టీడీపీలో చేరిన టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్- ఆహ్వానించిన నారా లోకేశ్ - actor nikhil joined in tdp

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన సుమారు 350 మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఒంగోలులోని నగరంలోని 32వ డివిజన్ వరకు ర్యాలీతో వైసీపీ నుంచి 150 కుటుంబాలు టీడీపీ చేశారు. 48 డివిజన్ లో వైకాపా లో ఉన్న 200 మంది కార్యకర్తలు, నాయకులు టీడీపీలోకి జనార్ధన్ ఆధ్వర్యంలో చేరారు. వారికి ఆ పార్టీ నేత దామచర్ల జనార్ధన్‌ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో సరైన ప్రధాన్యత లేకపోవడంతోనే టీడీపీలోకి చేరామన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని దామచర్ల జనార్ధన్ చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దగ్గరకు వస్తే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని జనార్ధన్‌ భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి, తనను గెలిపించాలని ఆయన సూచించారు.

కళ్యాణదుర్గం : సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా నుంచి తెలుగుదేశం, జనసేనలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఒకటో వార్డు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వారితో పాటు 50కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. వారందరిని టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు కండువాకప్పి పార్టీలోకి సాదరంగా అహ్వానించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే మున్సిపాలిటీలోని ప్రతి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. అదే విధంగా చిత్తూరు జిల్లా పలమనేరులో 30 మంది ముస్లిం మైనారిటీ యువకులు జనసేనలో చేరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి సమక్షంలో మైనారిటీ యువకులు జనసేన కండువా కప్పుకున్నారు.

తాయిలాల ఆశ చూపి - బలవంతంగా వైసీపీ కండువాలు కప్పుతున్న నేతలు - YCP Scarves by Force

పాణ్యం నియోజకవర్గం : కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్ 19 వ వార్డ్ గణేష్ నగర్ కి చెందిన వైసీపీ పార్టీకి చెందిన యువత శివ ప్రసాద్, జయరాంతో పాటు 100 మంది యువకులు గౌరు చరిత రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ చరిత రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

చంద్రగిరి నియోజకవర్గం : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీని వీడి టీడీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రగిరి మండలం అగరాల పంచాయతీలో వైసీపీ పార్టీని వీడిన వంద కుటుంబాలు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

వైసీపీకి షాక్​ ఇస్తున్న నేతలు, కార్యకర్తలు - ఎన్డీఏలోకి భారీగా కొనసాగుతున్న వలసలు - Joining TDP and Janasena from YCP

వందల సంఖ్యలో వైఎస్సార్సీపీని వీడి సైకిల్ ఎక్కుతున్న కార్యకర్తలు
Last Updated :Mar 31, 2024, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.