ETV Bharat / state

పెళ్లింట విషాదం - కారు బోల్తా పడి పెళ్లి కుమార్తె తల్లి సహా ముగ్గురు మృతి - ROAD ACCIDENTS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 10:40 AM IST

Naidupalem_National_Highway_Road_Accident
Naidupalem_National_Highway_Road_Accident

Naidupalem National Highway Road Accident: కుమార్తె వివాహం చేసి బంధువులతో సంతోషంగా తిరిగివస్తున్న తల్లిని, బంధువులను మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్​తో సహా ముగ్గురు తీవ్ర గాయాలుపాలయ్యారు. ఈ ఘటన నాయుడుపాలెం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

Naidupalem National Highway Road Accident: ఎంతో ఘనంగా కుమార్తె వివాహం చేసి బంధువులతో సంతోషంగా తిరిగివస్తున్న తల్లిని, బంధువులను మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్​తో సహా ముగ్గురు తీవ్ర గాయాలు పాలయ్యారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్ల కారు అదుపుతప్పి బోల్తాపడి ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

పెళ్లి ఇంట విషాదం- పెళ్లి కుమార్తె తల్లి సహా ముగ్గురు మృతి

పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా - ముగ్గురు మృతి - Three People Died in Accident

Three Were Died Three severely Injured: పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని పాల్వంచలో కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్​కు (RIMS) తరలించామని పోలీసులు వెల్లడించారు. కొద్ది సేపట్లో స్వగ్రామానికి చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిన్న సాయంత్రం వివాహానికి హజరై తిరిగి పెళ్లి కారులోనే బంధువులు, పెళ్లి కుమార్తె తల్లి అరుణ స్వగ్రామానికి పయనమయ్యారు. ఈరోజు ఉదయం 6.30 -7 గంటల సమయంలో నాయుడుపాలెం జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోవటంతో మిగిలిన ముగ్గురు వినోద్ (డ్రైవర్), వేణు, అభిలాష్ (బాలుడు)లను సహాయక చర్యలు చేపట్టి హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.

పెళ్లి ఇంట విషాదం - కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు వెళ్తుండగా ప్రమాదం - Road Accident

వివాహ వేడుకలు ముగించుకొని కందుకూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరికొద్ది సేపట్లో స్వగ్రామానికి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం జరగడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు అరుణ (పెళ్లి కుమార్తె తల్లి), దివ్య, శ్రావణిలుగా గుర్తించారు. అరుణ కుమార్తె వివాహం కోసం పాల్వంచ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగి కారు నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు వ్యక్తులు మృతి - Road Accident

Nellore Two Lorry Drivers Death: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం భోగ్యంవారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి మినీ లారీ ఢీకొట్టటంతో ఇద్దరు డ్రైవర్ల మృతి చెందారు. లారీ ఆపి టైర్లలో గాలి చూస్తున్న డ్రైవర్‌ను మినీలారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దలారీ డ్రైవర్‌, మినీ లారీ డ్రైవర్లు మృతి చెందారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ మృతదేహాన్ని జేసీబీ సహాయంతో పోలీసులు బయటకు తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.