ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కీలక నిర్ణయం - ప్రభాకర్‌రావు అరెస్టుకు కోర్టులో పిటిషన్‌ - Phone Tapping Case Update

author img

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 7:05 PM IST

Phone Tapping Case Petition in Court Update
Phone Tapping Case Update(ETV BHARAT)

Phone Tapping Case Update : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టు కోసం ఐపీసీ 73 కింద వారెంట్ జారీ చేయాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

Phone Tapping Case Petition in Court Update : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి సీఆర్పీసీ 73 కింద అరెస్ట్ వారంట్ జారీ చేయాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన సూత్రధారుడు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి కోర్టు అనుమతి తర్వాత రెడ్ కార్నర్ నోటీసులను దర్యాప్తు జారీ చేయనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా దేశంలో ఉన్నారని దర్యాప్తు బృందం గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.