ETV Bharat / state

వారం రోజుల్లో 76వేల దరఖాస్తులు పరిష్కరించాం : పొంగులేటి

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 7:19 PM IST

Updated : Mar 7, 2024, 7:47 PM IST

Minister Ponguleti on Dharani Special Drive : గత ప్రభుత్వం హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా ధరణి పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ వల్ల ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Minister Ponguleti
Minister Ponguleti on Dharani Special Drive

Minister Ponguleti on Dharani Special Drive : రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ వల్ల ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు. గత ప్రభుత్వం హడావిడిగా ఎలాంటి అధ్యయనం కూడా చేయకుండా ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆక్షేపించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఏదో ఒక కుటుంబం ధరణి(Dharani Portal) వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొందని అన్నారు. అవి పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ మేరకు మంత్రి స్పందించారు.

ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2,46,536 లక్షల దరఖాస్తులు(Dharani Applications) పెండింగ్‌లో ఉండగా వాటి పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎంఆర్‌ఏ స్థాయిలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌(Dharani Special Drive)లో 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్‌, ఆర్డీఓ, తహశీల్దార్‌ స్థాయిలో 76,382 దరఖాస్తులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

Dharani Special Drive Applications : రోజుకు 15 వేలు పైగా దరఖాస్తులు పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ప్రధానంగా పెండింగ్‌ మ్యూటేషన్‌కు సంబంధించి 15,070 దరఖాస్తుల్లో 5,471 వరకు పరిష్కరించామని అన్నారు. గ్రీవెన్స్‌ ఆఫ్‌ ల్యాండ్‌ మ్యాటర్‌ 40,605 దరఖాస్తులకు గాను 17,372, పాస్ బుక్(Land Pass Book) డేటా కలెక్షన్ సంబంధించి 1,01,132 దరఖాస్తులకు గాను 27,047 వరకు పరిష్కరించినట్లు చెప్పారు.

కోర్టు కేసులకు సంబంధించి 27,672 దరఖాస్తుల్లో 9,883 వరకు పరిష్కరించామని మంత్రి వివరించారు. ఇప్పటివరకు జరిగిన స్పెషల్‌ డ్రైవ్‌ ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పని చేసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను అధికారులు, సిబ్బంది పరిష్కరించడం పట్ల మంత్రి పొంగులేటి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు. ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రచారంలోనే ధరణి స్థానంలో వేరే పోర్టల్‌ తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగానే రాష్ట్రప్రభుత్వం ధరణిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు

భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు​ సర్కారు కసరత్తు

Last Updated : Mar 7, 2024, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.