ETV Bharat / state

ఓటేసి హైదరాబాద్ వస్తుండగా ఘోర ప్రమాదం - ఆరుగురు దుర్మరణం - PALNADU ROAD ACCIDENT TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 6:32 AM IST

Updated : May 15, 2024, 1:12 PM IST

Palnadu District Accident Today : సొంతూరిపై మమకారం. ఓటు వేయాలని దృఢ సంకల్పం. పిల్లాజెల్లాతో ఇంటిల్లిపాదీ స్వస్థలాలకు విచ్చేశారు. బంధుమిత్రులతో రెండు మూడు రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పరు రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవరుతో సహా నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. కళ్లు తెరిచేలోపే అగ్నికీలలకు ఆహుతైన విషాదమిది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాలపాలుజేసింది. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.

Five Killed in Accident at Palnadu District in AP
Five Killed in Accident at Palnadu District in AP (ETV Bharat)

ఓటేసి హైదరాబాద్ వస్తుండగా ఘోర ప్రమాదం - ఆరుగురు దుర్మరణం (ETV Bharat)

Road Accident at Palnadu in AP : ఓటు వేసేందుకు హైదరాబాద్​ నుంచి సొంతూరికి వచ్చారు. బంధుమిత్రులతో రెండు, మూడు రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పరు రూపంలో దూసుకొచ్చి ఆరుగురు నిండు ప్రాణాలను బలిగొంది. కళ్లు తెరిచేలోపే అగ్నికీలలకు ఆహుతైన విషాదమిది. గాఢ నిద్రలో ఉన్న 20 వంది ప్రయాణికులను తీవ్ర గాయాలపాలుజేసింది.

స్థానికులు, క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం - పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌ బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగి బస్సు దగ్ధం అయ్యింది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి : ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. నీలాయపాలెంకు చెందిన కాశీ బ్రహ్మేశ్వరరావు (62), ఆయన భార్య లక్ష్మి (58), మనవరాలు శ్రీసాయి (9) దుర్మరణం పాలయ్యారు. క్షతగాత్రులను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు.

తేరుకునేలోపే తెల్లారిన బతుకులు : ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్ అంజి, మధ్యప్రదేశ్‌కు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ హరిసింగ్‌ మరో నలుగురు ఆహుతి అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు.

బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్‌ వర్క్‌ జరుగుతుండటం, తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్‌ వేగంగా దూసుకురావడం టిప్పర్‌ చోదకుడు వేగాన్ని నియంత్రించ లేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.

టైలర్​ షాప్​లో ఘోర అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి - Maharashtra Fire Accident

బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని గుంటూరు తరలించారు. ముందుగా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి ఆ తర్వాత గుంటూరు రెఫర్ చేశారు. వీరిలో 9మంది జీజీహెచ్​కు రాగా ఒకరు రమేశ్​ ఆసుపత్రికి వెళ్లారు. జీజీహెచ్​కు తరలించిన వారిలో ఐదు మందికి మాత్రం స్కానింగ్, ఎక్స్ రే, ఈసీజీ వంటి పరిక్షలు నిర్వహించారు. మిగతా నలుగురికి ఎలాంటి ఇబ్బంది లేదు. జీజీహెచ్​లో చేరిన వారిలో శంకర్రావు, ఆదిలక్ష్మి, లిప్సిక చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ప్రస్తుతం రాజి, సాయి అనే ఇద్దరు మాత్రమే జీజీహెచ్​లో ఉన్నారు. బస్సు ప్రమాదంలో మంటలు చెలరేగటంతో భావన అనే మహిళకు గాయాలయ్యాయి. ఆమె గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భావన శరీరానికి 15శాతం మేర గాయాలైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేశారు. అర్థరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది. బస్సు వెళ్లి టిప్పర్​ను ఢీకొనగానే ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియలేదని ప్రయాణికులు అంటున్నారు. ప్రాణాలతో బయటపడతామని ఆనుకోలేదని తెలిపారు. బస్సులో డ్రైవర్​కు సమీపంలోని సీటులో సాయి అనే యువకుడు కూర్చున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అతను కిందకు పడిపోయాడు. వెంటనే తేరుకుని బస్సు డోర్లు తీసి కిందకు దిగారు. దీంతో లోపల ఉన్న వారంతా గబగబా బయటకు వచ్చేందుకు వీలయింది.

చంద్రబాబు దిగ్భ్రాంతి : ఈ ప్రమాదంపై చంద్రబాబు, పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి బాధాకరంమని, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు.

పాత ఇనుప సామగ్రి దుకాణంలో పేలిన సిలిండర్లు - తప్పిన ప్రాణనష్టం - Fire Accident At Kukatpally

Last Updated :May 15, 2024, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.