ETV Bharat / state

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌పై ఈసీ నిషేధం - 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయొద్దు - EC Bans KCR From Election Campaign

author img

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 6:40 PM IST

Updated : May 1, 2024, 7:32 PM IST

EC Bans Former CM KCR From Election Campaign
EC Bans Former CM KCR From Election Campaign

EC Bans Former CM KCR From Election Campaign : బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​కు ఈసీ షాకిచ్చింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్​ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిరంజన్​ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ చర్యలకు పూనుకుంది.

EC Bans Former CM KCR From Election Campaign : బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​పై 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. కాంగ్రెస్​ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్​పై ఈసీ ఈ విధంగా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్​ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిరంజన్​ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నిషేధం విధించింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసీఆర్​పై చర్యలకు ఈసీ పూనుకుంది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్​ 5న సిరిసిల్లలో కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్​ ఫిర్యాదు చేశారు.

రైతులతో బీఆర్​ఎస్​ అధినేత మాటామంతి - సర్కార్​పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు - KCR Bus Yatra in Telangana

ఈసీకి కేసీఆర్​ ఇచ్చిన వివరణ : ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ కేసీఆర్​ సమాధానం కోరింది. దీనికి గులాబీ బాస్ వివరణ ఇచ్చారు. తన మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదన్నారు. స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని తెలిపారు. కాంగ్రెస్​ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదని, వ్యాఖ్యలను కాంగ్రెస్​ నేతలు ట్విస్ట్​ చేశారన్నారు. తాను కేవలం కాంగ్రెస్​ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించానని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్​ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయొద్దని నిషేధం విధించింది.

నిషేధంపై ఎన్నికల సంఘం వివరణ : కేసీఆర్​ ఇచ్చిన వివరణపై ఈసీ సంతృప్తిని చెందలేదు. సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ స్పష్టం చేసింది. గతంలోనూ ఎన్నికల సమయంలో కేసీఆర్​ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ తెలిపింది. పార్టీ అధినేతగా, స్టార్​ క్యాంపెయినర్​గా కేసీఆర్​ ఎన్నికల నియమావళిని పాటించి ఇతర నేతలకు ఆదర్శంగా నిలవాలని సూచించింది. అందుకే 48 గంటల పాటు బహిరంగసభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియాతో మాట్లాడరాదని నిషేధం విధించింది. ఈ నిషేధ ఆదేశాలు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి 48 గంటల పాటు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ 48 గంటలు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.

కేటీఆర్​ ట్వీట్​ : ఏకంగా తెలంగాణ అవాజ్​ కేసీఆర్​ గొంతు పైనే నిషేధమా? అంటూ ఇదెక్కడి అరాచకం అంటూ బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? మోదీ ప్రసంగాలపై వేల ఫిర్యాదులు వచ్చినా చర్యల్లేవు అంటూ ధ్వజమెత్తారు. రేవంత్​ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? విరుచుకుపడ్డారు. బడే భాయ్​, చోటే భాయ్​ కలిసి చేసిన కుట్ర కాదా ఇది అంటూ ఎక్స్​ వేదికగా కేటీఆర్​ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కేసీఆర్ పోరు బాట కార్యక్రమం చూసి ఎందుకు కాంగ్రెస్​, బీజేపీ వాళ్లు వణికిపోతున్నారని ప్రశ్నించారు. అందుకే మీ అహంకారానికి, సంస్థాగత దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసు - కేసీఆర్​పై ఫిర్యాదు నమోదు - Telangana Phone Tapping Case

జైలుకు వెళ్లేందుకు నేను ఎన్నడూ భయపడలేదు : కేసీఆర్​ - KCR BUS Yatra In Telangana

Last Updated :May 1, 2024, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.